28-06-2025 12:28:25 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రం, ఆర్డిఎస్డియు తెలంగాణ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2022 - 25 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల హనుమకొండ ప్రాంగణంలో అప్రెంటిస్ట్ జాబ్ మేళా 2025ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్రీధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఇలాంటి జాబ్ మేళలు ఎంతగానో దోహదపడతాయని, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నైపుణ్యాల అభివృద్ధికి ఉపాధికి కల్పనలకు సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలని జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు.