11-12-2025 06:35:40 PM
చొప్పదండి (విజయక్రాంతి): మండలంలో గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు విలేకరులు పోలింగ్ సరళి సమాచారం తెలుసుకుందామని వెళితే, కేంద్రాల వద్దకు విలేకరులు అసలే రావద్దని బెదిరించి పంపించారు. విలేకరి తనకున్న ఐడి కార్డు చూపించిన విలేకరులు ఇక్కడికి వచ్చే అవసరం లేదని ఫోటోలు తీయవద్దని బెదిరించి మొబైల్ లాక్కున్నారు.
అక్కడున్న గ్రామస్తులు చెప్పిన వినకుండా ఏమి చేస్తారో చేసుకోండి అని బెదిరించారు. మండల రిపోర్టర్లు అందరు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి స్థానిక ఎస్ఐ నరేష్ రెడ్డికి సమాచారం అందించగా పోలింగ్ కేంద్రానికి వచ్చి అక్కడున్న పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి విలేకరి మొబైల్ ఇప్పించారు. విలేఖరి మొబైల్ లాక్కున్న పోలీసుపై ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మండల విలేకరులు డిమాండ్ చేశారు.