calender_icon.png 8 June, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలి

26-05-2025 05:23:16 PM

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి(Former MLC Alugubelli Narsi Reddy) పేర్కొన్నారు. తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు రోజులపాటు నిర్వహించే ప్రచార జాతను జిల్లా కేంద్రంలో సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్యారంగం 90% పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో కేవలం 40 శాతం మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. నేడు యువ దంపతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి పడిపోతున్నదని అన్నారు.

పట్టణ ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున దానికి అనుగుణంగా ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, సూర్యాపేట అధ్యక్షులు ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, నాగమణి టీఎస్ యుటిఎఫ్  రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, టాప్రా నల్లగొండ జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర, కార్యదర్శి శాం సుందర్,మ, డివైఎఫ్ఐ నల్లగొండ అధ్యక్షులు మహేష్, టీఎస్ యుటిఎఫ్ నుండి యడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ళ సైదులు, కొమర్రాజు సైదులు, మురలయ్య తదితరులు పాల్గొన్నారు.