calender_icon.png 7 June, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జననీయాత్రను సద్వినియోగం చేసుకోవాలి

26-05-2025 05:17:32 PM

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పిల్లలు లేని దంపతులకు అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ(Oasis Fertility) ఆధ్వర్యంలో నల్లగొండలో జననీ యాత్ర చేపట్టడం అభినందనీయమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Congress Party President Gummula Mohan Reddy) అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఖయ్యూం బేగ్ తో కలిసి జననీ యాత్రను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... పిల్లలు కాని దంపతులు ఆర్.ఎం.పి కలవడం, ఆ తర్వాత మందులు వాడుతున్నారని పేర్కొన్నారు. 

మనకు ఉన్న సమస్యలు లోపం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.పిల్లలు పుట్టని దంపతులను బయటి వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వేధిస్తారని, అవమాన పరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపాన్ని గుర్తించి నీ కలలను సహకారం చేసుకోవచ్చని సూచించారు. పిల్లలు పుట్టక పోతే విడిపోయిన దంపతులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. అమ్మానాన్నలవ్వాలని ఆశ దిశగా పిల్లలు పుట్టనీ దంపతుల కోసం నల్లగొండలో జననీ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ఒయాసిస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సాయి మానస దార్ల మాట్లాడుతూ... ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రాలోని 13 పట్టణాలలో క్యాంపులు నిర్వహించి 400 జంటలకు ఉచిత ఫర్టిలిటీ స్క్రీనింగ్, సలహాలు అందించడంతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు.