ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరగాలి

30-04-2024 12:12:03 AM

అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ 

మంథని, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కమాన్‌పూర్ మండలంలోని గుండారం, రామగిరి మండలంలోని నాగేపల్లి, లద్నాపూర్ గ్రామల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరపై కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేసి, రైతులకు సకాలంలో చెలింపులు జరిగేలా చూడాలని అన్నారు.