జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నేడు (మంగళవారం) జరగనున్న జన జాతర బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కాంగ్రె స్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తదితరులు పాల్గొంటారని ఎమ్మెల్యేలు తెలిపారు. సభకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.