డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పిలుపు
కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మ న్ పోచారం భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బాన్సువాడ మండలం రాంపూర్, పులికుచ్చతాండా, రాంపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ను గెలిపించుకుంటే పార్లమెంట్ సెగ్మెంట్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ఓట్లు పెడుతున్నారన్నారు. మనసులో రుణమాఫీ చేసే ఉద్దేశం ఉంటే దేవుళ్లపై ఓట్లు వేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రచారం నాయకులు అంజిరెడ్డి, హరిసింగ్, మోహన్నాయక్, వెంకట్రామిరెడ్డి, అంబర్ సింగ్ పాల్గొన్నారు.