గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం
నస్పూర్, ఏప్రిల్ 24 : ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జిపిఓల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిపిఓ, ఆర్ ఐ యాప్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి తహసిల్దార్ మల్లికార్జున్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వి.ఆర్.ఓ., వి.ఆర్.ఏ. లుగా సేవలు అందించిన వారు గ్రామంలో జరిగే అన్ని విషయాలను ప్రభుత్వానికి అందించి ప్రజా సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు గ్రామ పాలన అధికారులుగా నియమించామని, గ్రామ స్థాయిలో ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జి పి ఓ ల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు.
కులం, ఆదాయం ఇతర ధ్రువపత్రాల కొరకు మీ సేవా ద్వారా అందిన దరఖాస్తులను యాప్ ద్వారా పరిశీలించి పరిష్కరించవచ్చని, తద్వారా సమయం ఆదావుతుందని, పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. విధుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




