అధికార పార్టీ స్వయంకృతం
ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్వయంకృత ఆపరాధం వల్లే పట్టభద్రుల స్థానం లో ఓటమి చెందింది.. విద్యారంగం, ఉపాది రంగాల్లో గత సంవత్సరం కాలంలో అనేక మార్పులు జరిగినా చేసిన అభివృద్ధిపై సరైన ప్రచారం చేసుకోలేదు. లబ్ధి పొందిన ఆయా వర్గాలవారు కూడా మార్పును త్వరగా మర్చిపోయారు.
ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రస్తుత సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల శుభ్రతకు, ఇతర పనులకు స్కావేంజర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు పరిశుభ్రత ఉండే విధంగా చూస్తున్నారు. అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉన్న టీచర్ ప్రమోషన్స్ ద్వారా 15 వేల మంది కి పదోన్నతి కల్పించారు.
కొత్త ప్రభుత్వం రాగానే 11062 టీచర్ పోస్టులు భర్తీ చేశారు.. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ ఉద్యోగాలు కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేశారు,బదిలీలు పూర్తి చేశారు.. ఈ అంశాలు బలంగా చెప్పుకోకపోవడంవల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది.
రావుల రామ్మోహన్ రెడి,్డ జనగాం






