పాఠశాల భవనాన్ని వేగంగా పూర్తిచేయాలి
21-06-2024 12:15 AM
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
కామారెడ్డి, జూన్ 20 (విజయక్రాంతి): బాన్సువాడ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని త్వరిత గతిన పూర్తిచేయాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం పాఠశాల భవన నిర్మా ణాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడారు. పాఠశాలలో సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, కష్ణారెడ్డి ఉన్నారు.






