ప్రశాంతంగా పోలింగ్
* మండలంలో 85.82% నమోదు
* అత్యధికంగా పీచుపల్లిలో 92.98%
* కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
చిగురుమామిడి (విజయక్రాంతి): రెండో విడత పంచాయతీ ఎన్నికలు మండలంలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తీవ్ర చలి కారణంగా ఉదయం 9 గంటల వరకు మందకోడిగా సాగగా, ఆ తర్వాత ఊపందుకుంది. మండలంలోని 17 పంచాయతీల్లో కలిపి 85.82% పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా పీచుపల్లిలో 92.98% నమోదైంది. కాగా చిన్న ముల్కనూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
కాగా చిగురుమామిడిలో 84%, సుందరగిరిలో 87.26%, రేకొండలో 85%, బొమ్మనపల్లిలో 82.06%, నవాబుపేటలో 86.44%, కొండాపూర్ లో 87.25%, గాగిరెడ్డిపల్లి లో 88.74%, లంబాడిపల్లి లో 89.83%, ముదిమాణిక్యం లో 85.60%, సీతారాంపూర్ లో 90.41%, ముల్కనూర్ లో 87.75%, రామంచ లో 87.84%, గునుకుల పల్లి లో 85.46%, ఇందుర్తిలో 82.14%, ఉల్లంపల్లి లో 86.77%, ఓగులాపూర్ లో 86.79% పోలింగ్ నమోదైంది. కాగా తన స్వగ్రామమైన రేకొండలో సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.




