18 April, 2026 | 12:08 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి

29-04-2025 12:45 AM

తిమ్మాపూర్, ఏప్రిల్ 28: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి సర్వే చేస్తున్న అధికారులను ఆదేశించారు. మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు.

అర్జీదారు దరఖాస్తును, ఫీల్డ్ సిబ్బంది వెరిఫికేషన్ ఫారాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండడానికి వీలులేదని, వచ్చిన దరఖాస్తులలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తహసిల్దార్ రాజేశ్వరి, ఎం.పి.డిఓ, పంచాయతీ కార్యదర్శి రేవంత్, ఉన్నారు.