calender_icon.png 23 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలోనూ అదే తీరు!

23-01-2026 12:00:00 AM

అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం పూర్తిగా చదవకుండానే గవర్నర్ వాకౌట్

  1. అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  2. థావర్ చంద్ గెహ్లాట్ వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహం
  3. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో సిద్ధరామయ్య
  4. గవర్నర్ నిర్ణయానికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు

బెంగళూరు, జనవరి 22 : తమిళనాడు, కేరళలో మాదిరిగానే కర్ణాటకలోనూ అదే తీ రు వివాదం భగ్గుమంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రభు త్వ ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే రెం డు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేం ద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్  నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 

అసలు ఏం జరిగిందంటే..

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం సభలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రసంగించాల్సి ఉంది. సాధారణంగా ప్రభు త్వం రాసిచ్చిన ప్రసంగం కాపీని గవర్నర్ సభలో చదువుతారు. ఈ సంప్రదాయం మేరకు సిద్ధరామయ్య ప్రభుత్వం గవర్నర్‌కు ప్రసంగం కాపీ అందించింది. అందులో ఇటీవల కేంద్రం నరేగాలో చేసిన మార్పులను వ్యతిరేకించింది. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని ఈ ప్రసంగం కాపీలో ప్రస్తావించింది.

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో సిద్ధం చేసిన తన ప్రసంగాన్ని గవర్నర్ గెహ్లాట్ ముందుగానే గ్రహించి ఆక్షేపించారు. అయితే, ఉదయం సభకు వచ్చిన ఆయన తొలుత ప్రసంగ ప్రతులను చదివేందుకు నిరాకరించారు. ఆ తర్వాత తప్పదన్న ట్లు మొక్కుబడిగా ‘రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ప్రసంగాన్ని ముగించేశారు.

కుటిల ప్రయత్నాన్ని తిప్పికొట్టారు : కర్ణాటక బీజేపీ చీఫ్

కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల ప్రయత్నాన్ని సరిగ్గా తిప్పికొట్టారంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కొనియాడారు. గవర్నర్ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనకు సీఎం సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య : సిద్ధరామయ్య

ఆపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సభలో నుంచి వెళ్లిపోతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీఎం సిద్ధరామయ్య కూడా గవర్నర్‌పై మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.