21-12-2025 01:14:32 AM
రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్తోపాటు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో గతేడాది కంటే ఈసారి అత్యల్పంగా 4.5 డిగ్రీలు నమోదు కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.