05-02-2026 12:12:25 AM
కాంగ్రెస్ అభ్యర్థి పస్తం మల్లమ్మ ఆత్మహత్యాయత్నం
యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఘటన
చౌటుప్పల్, ఫిబ్రవరి 4: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిం తల ఉమామహేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాలనీవాసులు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వార్డులో 1,430 మంది ఓటర్లు ఉన్నప్పటికీ తమకు ఓటు హక్కు లేకుండా ఏకగ్రీవం ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆందోళనకారులు వా పోయారు.
ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేసి, వార్డులో ఎన్నికలు నిర్వహించి తమకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఓటు హక్కు కల్పించకపోతే తామంతా చనిపోయినట్టేనని, ఇందుకోసం తమ అందరికీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి అంటూ కాలనీ వాసులు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఓటర్ల అపనింద.. అభ్యర్థి ఆత్మహత్యా ప్రయత్నం
17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్న పస్తం మల్లమ్మ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డబ్బులు తీసుకొని నామినేషన్ ఉపసంహరణ చేసుకొని, వార్డులో ఎన్నికలు లేకుండా చేశావంటూ కాలనీవాసులు నిందలు వేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై తన ఇంట్లోనే చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు య త్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది పార్టీ కార్యకర్తలు గమనించి మల్లమ్మను కాపాడారు.