11-12-2025 12:54:03 AM
మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 10: మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ప్రతి పనిని నాణ్యతగా ఉండేలా చేయాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని రూ 14 కోట్ల వర్కులను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో నాగర్ కర్నూల్ రోడ్డు ఏరియాలో పరిశీలించారు.
కావేర మ్మపేట దగ్గర జరుగుతున్న నిర్మాణ పనులను నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయం ప్రక్కన రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించుట కోసం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఈ విజయ భాస్కర్ రెడ్డి , డీఈ మల్లేష్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.