11 May, 2026 | 2:47 PM

వైదేహి నగర్‌లో చోరీ

24-03-2025 03:12 PM

17 తులాల బంగారం, రూ. 50 వేల నగదు చోరీ 

ఎల్బీనగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైదేహి నగర్ లోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వైదేహి నగర్ లో నివాసం ఉంటున్న టీవీ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన 17 తులాల బంగారం, రూ. 50 వేల నగదును అపహరించారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.