11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలి

24-03-2025 03:17 PM

హయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా 

ఎల్బీనగర్: అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. హయత్ నగర్ లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నాయకులు రవీంద్ర చారి, సామిడి శేఖర్ రెడ్డి  ఆధ్వర్యం లో మహిళలు ధర్నా నిర్వహించారు.  అనంతరం ఎమ్మార్వో ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ .. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో తీసుకున్న అప్లికేషన్ల ఆధారంగా అర్హులను వెంటనే ప్రకటించాలని, భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న పేద ప్రజలకు ఇస్తానన్న రూ. 5 లక్షలు వెంటనే ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగాయని, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని రూ. 8 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.