calender_icon.png 2 June, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో వందకు చేరువలో రాతిచిత్రాల తావులు

31-05-2025 12:00:00 AM

  1. ఉల్లంపల్లిలో కొత్త రాతియుగంనాటి ఆనవాళ్లు

6 వేల ఏండ్ల కింది మూపురపుటెద్దుల రాతిచిత్రాలు

కరీంనగర్, మే 30: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలోని ఓదెల మల్లన్న గుడివున్న గుట్టవద్ద 40 అడుగుల ఎత్తున్న రాతిగోడపై శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణా కర్, మహమ్మద్ నసీరుద్దీన్‌తో కూడిన తెలంగాణ చరిత్రకారుల బృందం కొత్త రాతియు గంనాటి కొత్త రాతిచిత్రాలను గుర్తించింది. తాజాగా గుర్తించిన వాటితో రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు రాతిచిత్రాల ఆనవాళ్లు గుర్తించినట్లయింది.

ఉల్లంపల్లిలో గుట్టపై చరిత్రకారుల నూరుడుగుంటలు సైతం ఉన్నట్లు తేల్చింది. భౌగోళికంగా 79.234548 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.184904 డిగ్రీల ఉత్తర అక్షాంశాల్లో నైరుతి దిశ ముఖంగా ఉన్నట్లు నిర్ధారించింది . ఈ చిత్రిత శిలాశ్రయంలో రాతిగోడపై మూడు తావుల మూ డు మూపురపుటెద్దుల తొక్కుడు బొమ్మలు (రాక్ బ్రూయిజింగ్స్) ఉన్నాయి. రెండింటి ముందర ఇద్దరు నిలబడి వున్న మనుషుల ఛాయవంటి బొమ్మలున్నాయి.

ఒక ఎద్దుబొమ్మ రెండు అడుగులకు మించిన ఎత్తు, నాలుగు అడుగుల ఎత్తు, రెండోది రెండు అడుగుల పొడవు, రెండు అడుగుల ఎత్తు, మూడోది రెండు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల ఎత్తుతో కని పించాయి. ఇంత పెద్దగా తొక్కుడు బొమ్మలు కనిపించడం తెలంగాణాలో రేగొండ తర్వాత ఇది రెండోసారి. మూపురపుటెద్దులు జననాంగాలతో కనిపించడం చాల్కోలిథిక్ పీరియడ్ రాతిచిత్రాల లక్షణమని పురావస్తుశాఖ పూర్వ డెరెక్టర్ వీవీ కృష్ణశాస్త్రి పేర్కొన్నారు.

ఎరుపు రంగు రాతిచిత్రాలున్న ఎడితనూరులో ఇలాంటి మూపురపుటెద్దులు మొదట కనిపించాయి. కొత్తరాతియుగానికి చెందిన రాతి తొక్కుడుబొమ్మలు 6 వేల సంవత్సరాల క్రితం నాటివని బృందం సలహాదారు బండి మురళీధర్‌రెడ్డి నిర్ధారించారు.

మల్లన్నగుడి ముందర 16 అడుగుల ఎత్తున నిలువురాయి (మెన్హ ర్) ఉన్నదని, చిగురుమామిడి మండలం లో చాలాచోట్ల మెగాలిథిక్ సమాధులు, అతిపెద్ద మూత రాళ్లు గతంలోనే చరిత్రకారుల బృందం గుర్తించింది. తెలంగాణ పురా వస్తుశా ఖ ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే, ఇదొక చరిత్రపూర్వయుగ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.