2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

బెల్లంపల్లి అటవీ రేంజ్ లో పెద్దపులి సంచారం ఉంది

16-09-2025 01:07 PM

ఎఫ్ ఆర్ ఓ పూర్ణచందర్ స్పష్టం..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని కాసిపేట, దేవాపూర్, బెల్లంపల్లి బుగ్గ, మాదారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందని బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్(Forest Range Officer Poorna Chander) వెల్లడించారు. పెద్దపులి సంచారంపై విజయక్రాంతికి స్పష్టత ఇచ్చారు. గత కొంతకాలంగా అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి కదలికలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన బి-1 పెద్దపులి భూపాలపల్లి అడవుల వైపు వెళ్లిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులిని తిర్యాణి టైగర్ గా చెబుతున్నామన్నారు. అటవీ రేంజ్ పరిధిలోని బుగ్గ గూడెంలో 2, ముత్యంపల్లిలో 1, మాదారం అటవీ ప్రాంతంలో 3 నుండి 4 వరకు చిరుతపులులు సంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు. చిరుతపులల నుండి పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ అడవి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు, అటవీ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.