11-09-2025 12:48:58 AM
వర్షిత్రెడ్డిపై సీనియర్ల గుస్సా
నల్లగొండ టౌన్, సెప్టెంబర్10(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షు డుగా నాగం వర్షిత్ రెడ్డి రెండవసారి నియామకం జిల్లా కమల దళంలో కల్లోలం రేపుతోంది. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నా రు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్ ను కలు పుకుని పోవడం లేదని,
ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆ యన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ. వర్షిత్ రెడ్డి మొదట్లో అసమ్మతినేతల మీద పైచేయి కోసం యత్నిం చినప్పటికీ ఆ వ్యూహం బెసిడికొట్టడంతో రూటు మార్చి వాళ్ళ గడపలు తొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసమ్మతి నేతలతో బ్రేక్ ఫాస్ట్, లంచ్ మీటింగ్స్ నిర్వహిస్తూ నష్ట నివారణ చర్యలకు తీసుకుంటు న్నట్టు సమాచారం.
అయినా కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదని కాషాయ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. పార్టీ పెద్దల నుండి బు జ్జగింపులే తప్ప తమకు పెద్దగా ఉపయోగపడే హామీ రాకపోవడం తో దూకుడు పెంచిన అసమ్మతి నాయకులు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం.
తమ బలం, బలగం ఏంటో కమలం పార్టీ జిల్లా నేతలకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ మారేందుకు కూడా కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆనోటా, ఈనోటా ఈ వి షయం తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు కమ్ కమ్ వెల్కమ్. మీరొస్తా మంటే మేం వద్దంటామా అంటూ రెడ్ కార్పెట్స్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
జిల్లాలో వన్మేన్ షో...
నల్లగొండ జిల్లా కమలం పార్టీలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వన్మేన్ షో చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా వాళ్ళు వీళ్ళు కాకుండా డైరెక్ట్గా పార్టీ కేడరే అలా మాట్లాడుకుంటోందన్న వ్యవహారం చర్చనీయాంశం అవు తోంది. తాజాగా నల్లగొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభ పూ జా కార్యక్రమం రచ్చ కూడా ఇందులో భాగమేనంటున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేదిక మీద ఉండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన రచ్చ, జరిగిన రసాభాస, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. వర్షిత్రెడ్డి వ్యవహరించిన తీరు వల్లే శాంతియు తంగా జరగాల్సిన కార్యక్రమంలో రచ్చ జరిగిందని కమలం పార్టీ నాయకుల వాదన.
ఒక హోదాలో ఉన్న నాయకుడికి ఎక్కడ తగ్గాలో, దేన్ని వివాదాస్పదం చేయాలో తెలియకుంటే ఎలాగని బీజేపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఆయన దూకుడు కారణంగానే వేదిక దగ్గరే ఉన్నప్పటికీ కమలం కేడర్ జిల్లా అధ్యక్షుడికి అండగా నిలబడలేకపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఓవైపు ఒకవైపు అయితే బీఆర్ఎస్ నేత, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మద్దతు పలకడం, ఆయన కోసం నిరసనకు దిగడం, గొడవ సద్దుమణిగాక ఇద్దరూ కలిసి గణేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలో రాజకీయ కలకలం రేపుతోంది.
ఇవన్నీ తాజా ఘటనలు కాగా కొంత కాలం నుంచి నాగం వర్షిత్రెడ్డి వ్యవహారశైలితో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలపై కూడా సీనియర్ నాయకులు వారి అనుచరగణం పెద్దగా ఆసక్తి చూపడంలేదని వినికిడి. ఆయన సీనియర్లకు ప్రాధ్యానత ఇవ్వకపోవడం, పార్టీలో సామాజిక సమీకరణలు పాటించకపోవడం, కీలక నేతల పర్యటనల సమయంలో వేదికల మీద ప్రోటోకాల్ పాటించకపోవడం, అంతా తానే అన్నట్టు వ్యవహరించడం లాంటి కారణాలతో ఆయ న్ను కొందరు నేతలు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు.
అసలు వర్షిత్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. రెండు వర్గా ల మధ్య సయోధ్య కోసం నల్గొండ నుంచి హైదరాబాద్ మీదు గా ఢిల్లీదాకా వెళ్ళినా ప్రయోజనం లేకపోగా అసంతృప్త నేతల మీద పైచేయి కోసం జిల్లా అధ్యక్షుడు చేస్తున్న విన్యాసాలు వికటించి పార్టీని కూడా ఇరకాటంలో పడేస్తున్నారని వినికిడి.
ఈ పరిస్థితుల్లో ఇటీవల నల్గొండ బీజేపీలో నోటితో మాట్లాడుకుంటూ నొసటితో వెక్కిరించుకోవడాలు పెరిగిపోయాయి. కార్యక్రమం ఏదైనా సరే జిల్లా అధ్యక్షుడు సై అంటే.. సీనియర్ నేతలు మరో ఆలోచన లేకుండా నై అంటున్నారు. ఈమధ్య అది పీక్స్కు చేరడంతో బీజేపీ కార్యక్రమాలు కొన్ని అంతర్గత రచ్చకు, మరికొన్ని బహిరంగ అసంత్రుప్తికి కారణం అవుతున్నాయంటున్నారు.
సామాజిక సమీకరణలు, పార్టీ సీని యర్స్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో పార్టీలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొందరు నేతలను పొమ్మనలేక పొగబెట్టే ప్రోగ్రామ్ కూడా రొటీన్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరూ విడివిడిగా. నల్గొండలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. పార్టీ కార్యకర్తలు పెద్దలు జోక్యం చేసుకోకుంటే ఇప్పుడు ఓ మాదిరిగా ఉన్న బలాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకోవాల్సి వస్తుందని సొంత సొంత నాయకులు హెచ్చరిస్తున్నారు.