6 May, 2026 | 8:07 PM

Breaking News

చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •  

దేవుళ్ల విషయంలోనే ఏకాభిప్రాయం లేదు

03-12-2025 12:27 AM

-ఇంత మంది ఉన్న కాంగ్రెస్‌లో..ఎలా ఉంటుంది?

-సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో  కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేవుళ్ల మీదనే మనకు ఏకాభిప్రాయం లేనప్పుడు.. పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుందన్నారు.

హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని.. పెళ్లికాని వారు హనుమంతుడిని, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుడిని, కొంతమంది శివమాల, ఇంకొం తమంది అయ్యప్పమాల వేస్తారని పేర్కొన్నారు. మందుతాగేవాళ్లకు, పప్పన్నం తినేవాళ్లకు, మాంసం తినేవాళ్లకు కూడా దేవుళ్ల మీద ఏకాభిప్రాయం ఉండదన్నారు.

తమ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్లు ఉన్నారని, వీరందరికీ ఏకాభిప్రాయమే ఉండాలంటే ఎలా కుదురుతుందని సీఎం అన్నారు.  పదవులు, పార్టీ కార్యక్రమాలు విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి పై విధంగా స్పందించారు.