15-05-2025 01:52:40 AM
-సీపీఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి
కల్లూరు, మే14 (విజయ క్రాంతి): దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సత్తుపల్లి డివిజన్ సిపిఎం కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి కోరారు. బుధవారం ఆపార్టీ కల్లూరు మండల కమి టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బ ట్టు నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొనే మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని,భూమి లేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ 12 వేలు ఇవ్వాలని, నిరుపేద మహిళలందరికీ రూ 2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ,కార్మికులపట్ల,రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జరిగే సార్వత్రిక సమ్మెలో అన్య వర్గాల ప్ర జలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు..అదేవిధంగా ఈనెల 19 పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ కల్లూరు మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు,డివిజన్ కమిటీ సభ్యులు తన్నీరు క్రిష్ణార్జనరావు,మండలకమిటీ సభ్యులు సామినేని హనుమంతరావు,దోమతొట్టి పుల్లయ్య ,తిగుళ్ళబాబు,గంపల శ్రీనివాసరావు పాల్గొన్నారు.