23-04-2025 12:59:35 AM
- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- ఎరువులు విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి
- అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళను అందించాలి
- పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించాలి
వికారాబాద్, ఏప్రిల్ 22: జిల్లాలో నీటి కొరత లేకుండా, సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేటు లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశాని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యు లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య లు పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శాస న సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ప్రజా అవసరా లకు తగ్గట్టుగా నీటి సరఫరా చేపట్టాలన్నారు. నీటి కొరతను అధిగమించేందుకు గాను ప్ర భుత్వం అధిక నిధులను కేటాయించడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా అందించే ఓహెచ్ఆర్ నీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ నాణ్యమైన నీటి ని సరఫరా చేయాలని ఆయన సూచించా రు. అకాల వర్షాల వల్ల పంట నష్టo జరిగిన రైతులకు నష్ట పరిహారాన్ని అందించాలని స్పీకర్ తెలిపారు. పంటలు వేసే సమయం ఆసన్నమైనందున రైతులకు ఎరువులు, విత్తనాలు గోదాముల్లో అందుబా టులో ఉండేవి ధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ట్రాన్స్ ఫార్మర్లని మిత్తం దరఖాస్తులు చేసుకున్న రైతులను ఇబ్బందికి గురిచేయకుండా త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. అర్హులై న ప్రతి పేదవారికి గృహలక్ష్మి, మహాలక్ష్మి ప థకాలు వర్తించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా వచ్చిన జాబితాను పరిగణన లో తీసుకొని ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలని స్పీకర్ అధికారు లకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ యువ వికాస్ పథకం కింద యువతకు ఉపాధి కలిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పీ కర్ సూచించారు. సన్న బియ్యం ను పండించేందుకు రైతులను ప్రోత్సహించాలని స్పీకర్ తెలిపారు. సన్న బియ్యం కొనుగోలుకు కేం ద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల సౌకర్యార్థం నూతన చౌకధర దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా అందించే ఓహెచ్ఆర్ నీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ నాణ్యమైన నీటిని సరఫరా చే యాలని ఆయన సూచించారు.
క్షేత్ర స్థాయి లో అధికారులు కష్టపడి ప్రత్యేక కార్యచరణతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని ఆయన తెలిపారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇప్పటికే మంజూరైన రహదారుల నిర్మాణాల పను లు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పీకర్ సూచించారు.
సమీక్ష సమావేశంలో సంక్షేమ వసతి గృహాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, పెయింటింగ్ వేసిన దృశ్యాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా డిఎస్సిడబ్ల్యూఓ మల్లేశం వివరించారు. తదనంతరం సంక్షేమ వసతి గృహా లకు స్పీకర్ చేతుల మీ దుగా వంట సామాగ్రిని అందజేశారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.