calender_icon.png 19 June, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటలవి పచ్చి అబద్ధాలు

19-06-2025 01:50:54 AM

  1. ఆనాడు క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదికే రాలే 
  2. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): బీజేపీ నేత ఈటల రాజేందర్ ప చ్చి అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వ హించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనల్ నివేదిక గత టీఆర్‌ఎస్ హయంలో క్యాబినెట్ ముందుకు రాలేదని, మేడిగడ్డ ప్రాజెక్టు సాంక్షన్ అంశం కూడా క్యాబినెట్ ముందు కు రాలేదని తుమ్మల పేర్కొన్నారు.

కాళేశ్వరం కమిషన్  ప్రభుత్వానికి కొన్ని అంశా లను అడుగుతూ లేఖ రాసిందని, ప్రభు త్వం కూడా వివరాలన్నీ అందజేసినట్లుగా ఉందని చెప్పారు. ప్రాణహితతో పాటు ఆన్‌గోయింగ్, పెండింగ్ ప్రాజెక్టులపై అప్ప టీ ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ కేవలం రికమండేష న్స్ మాత్రమే చేస్తుందని ఆయన తెలిపారు. 

50కి పైగా వినతిపత్రాలు.. 

మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం లో  భాగంగా బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశానికి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు హాజరయ్యారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 50కి పైగా వినతిపత్రాలు అందాయని, ఎక్కువగా పేద ప్రజల నుంచి వచ్చినవే  ఉన్నాయని మం త్రి తెలిపారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజా వినతులను స్వీకరించి.. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో  మాట్లాడినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, వైశ్య కార్పోరేషన్ చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు.