1 July, 2026 | 6:55 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు

09-09-2024 12:44 AM

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం

ముషీరాబాద్, సెస్టెంబర్ 8: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర పుటల్లో సవర్ణాక్షరాలతో లిఖించబడిందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నాలుగు భాషలుగా ముద్రించి ప్రచురించిన బుక్లెట్‌ను ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి అధ్యక్షతన.. సురవరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

ముందుగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని పద్మ విభూషణ్, మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపీడకులైన దొరలు, దేశ్‌ముఖ్‌లకు మధ్య జరిగిన తెలంగాణ సాయు ధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతం రంగు అద్దుతున్న ఈ క్రమంలో తెలంగాణ సాయుధ పోరాట వాస్తవికత నేటి యువతరానికి తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.