22-07-2025 12:00:00 AM
గద్వాల్ టౌన్ జూలై 21: జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని వేణు కాలనీలో దొంగల ముఠా హడావిడి సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జ రిగిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా గద్వాల్ పట్టణం లోని వేణు కాలనీలో దొంగలు చొరబడి సాయి ప్రకాష్,బుగ్గారెడ్డి,ఆర్ఐ అశోక్,సందీ ప్ అనే వ్యక్తుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నా రు.
అప్రమత్తమైన స్థానికులు వెంటనే దొం గల చలనం గుర్తించి వారిపై గట్టిగా అరవడంతో దొంగలు అక్కడ నుండి జారుకు న్నారు. కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించిగా సమాచారం అం దుకున్న పట్టణ ఎస్త్స్ర కళ్యాణ్ కుమార్ వెంట నే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించినట్లు తెలిపారు.