27-12-2025 03:16:54 AM
అమరావతి, డిసెంబర్ 26: గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపం లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వెంకయ్య(70), సుశీల(64), మహే ష్ అనే యువకుడు, మరికొందరు కుటుంబసభ్యులు తిరుపతికి కారులో వెళ్లి తిరిగొ స్తున్నారు.
మార్గంమధ్యలో ఆపిన కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ వంశీధర్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమా ద వివరాలను తెలుసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.