అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల సీజ్
14-03-2025 12:09 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వర్ పల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను గురువారం పట్టుకుని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.






