05-12-2025 01:24:49 AM
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వీ ఆనంద్ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా నటించింది. ఈ నెల 12న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ను గురువారం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి ఇందులో సౌత్ ఇండియాలో పేరున్న ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా కనిపించనున్నారు.
ఈ సంస్థ అకౌంట్స్ హ్యాక్ కావటంతో ప్రజా మీడియా కార్పొరేషన్ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి. మరి ఆ హ్యాకర్ను హీరో పట్టుకోగలిగాడా? లేదా? అనేది టీజర్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఓషో వెంకట్; డీవోపీ: అబినందన్ రామానుజన్; యాక్షన్: మరేక్ సోలెక్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్: వివేక్ అన్నామలై.