26-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్25 ( విజ యక్రాంతి): తిర్యాణి మండలం కైరిగూడ ఓపెన్ కాస్ట్ గడలపల్లి రహదారి మధ్యలో అటవీ ప్రాంతంలో పులి సంచారం చేస్తున్న ట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు పులి అడుగుల గుర్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా గడలపల్లి సమీపంలో పులి పాదముద్రలు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పశువుల కాపరులు, రైతులు, ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు జాగ్రత్త పడాలని కోరారు.