11-12-2025 01:10:18 AM
ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట. డిసెంబర్ 10 (విజయక్రాంతి) : కల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగాకోస్గి,గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలా ల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శ కంగా, చట్టబద్ధంగా జరిపేం దుకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
మద్దూరు, కొత్త పల్లి మండల లకు గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందికి మద్దూర్ మండలం లోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కోస్గీ, గుండు మాల్ లో బందోబస్తు కు వచ్చిన పోలీ సులకు పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో ఎస్పీ భద్రత పరమై న సూచనలు చేశారు.ఈ నాలుగు మండలాలకు మొత్తం 650 మంది పోలీసు ఫోర్స్ , 02 టి ఎస్ ఎస్ పి బెటాలియన్స్, సి ఐ డి నుండి వచ్చిన ఫోర్స్ తో బారి బందో బస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి గ్రామంలో భద్రతా చర్య లను మరింత పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని ఈ నాలుగు మండ లాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉండగా,12 ఏకగ్రీవం అయ్యావి అని, మిగ తా 55 గ్రామపంచాయతీలకు పోలింగ్ నిర్వహణ జరుగు తోందని తెలిపారు. అందులో 13 సమస్యత్మక గ్రామ పంచా యతీలు ఉన్నాయి అని, అందులో 27 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించ బడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామపంచా యతీలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ పోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయ డం జరిగిందని తెలిపారు .
గ్రామపంచాయతీ ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహిం చాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని తెలిపారు. విధి నిర్వ హణలో బాధ్యత రాహితంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మద్దూరు, కొత్త పల్లి లో మండలాలకు మొత్తం 18 రూట్లు గా, కోస్గి , గుండు మాల్ మండలలో 15 రుట్లూ గా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిం దని తెలిపారు.
రూట్ మొబై ల్ ఆఫీసర్లు నిరంతరం పెట్రో లింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉండాలని, గ్రామాలలో గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బులు పంపిణీ, రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్ బూత్ దగ్గర విధులు నిర్వర్తించే పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉం టూ పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్స్ మైంటైన్ చేయాలని, ఎలాంటి గొడవలు జరుగ కుండా శాంతియుతంగా పోలింగ్ జరిగే విధంగా చూడాలని తెలిపారు.
పోలిం గ్ బూత్ నుండి 200 మీటర్ల వరకు ప్రజలు దూరంగా ఉండాలనీ అత్యవసరమైతే వెంటనే సంబంధిత లోకల్ పోలీసులకు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కి సమాచారం ఇవ్వాలని అన్నా రు. అందరూ శాంతియు తంగా ఎన్నికలు నిర్వహించే విధంగా కష్టపడి బాగా పని చేయాలని సూచించారు. ఎన్నిక సమయంలో ప్రతి పోలీసు అధికారి తన డ్యూ టీని పూర్తిగా నిబద్ధతతో నిర్వర్తించి, న్యాయబద్ధంగా నిష్పక్షికంగా పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుని శాంతి భద్రతలను కాపాడడం అత్యంత కీలకమని పేర్కొ న్నారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి సమస్యాత్మక గ్రామం,పోలింగ్ కేంద్రంలో అదనపు ఫోర్స్ను మోహ రించి మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సంద ర్భంగా ఎవరైనా భంగం కలి గించే ప్రయత్నం చేస్తే ఎవ్వ రినీ విడిచిపెట్టమని. అల్లర్లు, భయభ్రాంతులు సృష్టించా లని చూస్తే వారిపై చట్టప రమైన కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చుట్టూ తిరిగే వ్యక్తులు, గుంపులు ఎవరైనా ఉన్నా వెంటనే అరెస్టులు చేసి, కఠినంగా వ్యవహరి స్తాం అని స్పష్టం చేశారు.
ప్రజలు ధైర్యంగా, భయభ్రాం తులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును విని యోగించాలని, అనుమా నాస్పదంగా కనిపించే కార్య కలాపాలను వెంటనే పోలీ సులకు సమాచారం అందిం చాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ లు నల్లపు లింగయ్య, మహేష్ లు, సీఐ సైదులు, ఎస్త్స్ర లు విజయ్ కుమార్, బాలరాజు, పోలీసు అధికారులు, సిబంది తదితరులు పాల్గొన్నారు.