03-03-2025 04:57:46 PM
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ముత్యంపేట్ గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ (51) క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నడంతో వారికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మురికి వంశీకృష్ణ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచి ఆరవసారి రక్తదానం చేసిన మురికి వంశీకృష్ణకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తరఫున అభినందనలు తెలియజేశారు. ప్రతిరోజు చాలామంది వివిధ చికిత్సల నిమిత్తమై రక్తం కావాలని ప్రార్థించడం జరుగుతుందని వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేయాలంటే రక్తదాతలు ముందుకు రావాలి రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.