calender_icon.png 16 June, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా భూసమస్యల పరిష్కారం

16-06-2025 01:17:20 AM

  1. రైతులు పదేళ్లలో పడ్డ గోసను రెవెన్యూ సదస్సుల్లో చెబుతున్నారు
  2. --  7,578 రెవెన్యూ సదస్సుల్లో 4.61లక్షల దరఖాస్తులు స్వీకరణ
  3. ఐదు నక్షా గ్రామాల్లో శరవేగంగా భూసర్వే
  4. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రెవెన్యూ సద స్సుల్లో భూ సమస్యలపై రైతు లు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 3వ తేదీ నుంచి  హైదరాబాద్ జిల్లా మినహా రాష్ర్టవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 561 మండలా ల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణం గా పరిశీలించి మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూ చించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి మాట్లాడుతూ..

ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాల న్నారు. గత పదేళ్ల కాలంలో భూస మస్యలకు సంబంధించి రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారన్నారు.

శరవేగంగా భూసర్వే..

రాష్ర్టంలో తరతరాలుగా సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని ఐదు నక్షా గ్రామా ల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూసర్వే శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ర్టంలో 413 నక్షా గ్రామా లకుగానూ ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల మూడో వారం నుంచి సర్వే ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ర్టంలో పైలట్ గ్రామాలుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్‌లో 422 ఎకరాలకు 337 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు.

జగిత్యాల జిల్లా  భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్తది) గ్రామంలో 626 ఎకరాలకు 269 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలోని 845 ఎకరాలకు 445 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలకు 232 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్ నగర్‌లో 593 ఎకరాలకు 308 ఎకరాలలో సర్వే పూర్తయిందని తెలిపారు. మొత్తం ఐదు గ్రామాల్లో 2,988 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1,591 ఎకరాల్లో సర్వే పూర్తిచేసినట్టు వెల్లడించారు.