మట్టిని తరలిస్తున్న 13 టిప్పర్లు సీజ్
12-06-2024 02:01 AM
ఇబ్రహీంపట్నం, జూన్ 11 : సాగర్ హైవేపై వే బిల్స్ లేకుండా నడుపుతున్న 13 టిప్పర్ లారీలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీజ్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుర్మపల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి వే బిల్స్ లేకుండా నడుపుతున్న 13 టిప్పర్లను సీజ్ చేశారు. అనంతరం ఈ కేసును మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.






