6 May, 2026 | 8:16 PM

Breaking News

సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •  

నేడు జావెలిన్ త్రో ఫైనల్

08-08-2024 02:04 AM

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో నేడు పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. ఫైనల్లో ఢిపెండింగ్ చాంపియన్, భారత అథ్లెట్  నీరజ్ చోప్రా ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్ మరోసారి పసిడిపై గురిపెట్టాడు. క్వాలిఫికేషన్‌లో తొలి ప్రయత్నం లోనే బరిసెను 89.34 మీటర్లు విసిరిన నీరజ్ తొలి స్థానంలో నిలిచాడు. రెండు గ్రూపుల్లో నుంచి మొత్తంగా 12 మంది అథ్లెట్లు ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా నీరజ్‌కు.. వెబర్, పీటర్స్, అర్షద్ నదీమ్ నుంచి గట్టి పోటీ ఉండనుంది. ఇక భారత హాకీ జట్టు ఇవాళ కాంస్య పతక పోరు కోసం సిద్ధమైంది.