calender_icon.png 23 September, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

23-09-2025 12:00:00 AM

మహదేవపూర్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలో  ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాల ట్రాక్టర్ ను అర్ధరాత్రి పట్టుకున్నట్లు ఎస్త్స్ర పవన్ కుమార్ తెలిపారు. వెంటనే స్పందించిన మండల అగ్రికల్చర్ అధికారిని సుప్రజ్యోతి సోమవారం రోజున ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 తనిఖీ చేశారు.

ఈ కేంద్రం లో రికార్డులు సరిగా రాయడం లేదని కొన్ని యూరియా బస్తాలను రసీదులు లేకుండా పంపించడం జరిగిందని, ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రంపై ఎఫ్. సి. ఓ కు  ఈ సేవా కేంద్రానికి యూరియా పంపించ రాదని రికమెండ్ చేస్తూ లైసెన్స్ ను కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ లెటర్ రాయడం జరిగిందని,ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం 2 కు  షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగిందని అగ్రికల్చర్ అధికారిని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు వ్యవసాయ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.