calender_icon.png 30 May, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీల కొరతతో ట్రాక్టర్ వినియోగం

29-05-2025 08:08:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) యాసంగిలో రైతులు సాగుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసినప్పటికీ లారీల కొరత కారణంగా రైస్ మిల్లర్లకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు తమ ట్రాక్టర్లను వినియోగించి రైస్ మిల్లర్లకు వరి ధాన్యం తరలింపు చేస్తున్నారు. జిల్లాలోని సోన్, మామడా, లక్ష్మణ చందా, దిల్వార్పూర్, నర్సాపూర్, కుంటాల, సారంగాపూర్ తదితర మండలంలో రైతులు వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లలో వారి వారి ధాన్యంను తూకం వేయించుకొని స్వచ్ఛందంగా రైస్ మిల్లర్లకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు.

పంట కళ్ళల్లో ఉన్న వడ్లపై వానలు కురవడం వల్ల అవి తడిసిపోవడం కొనుగోలు కేంద్రాలు బురదమయం చిత్తడి కావడంతో లారీలు రాకపోవడం వచ్చిన లారీలు కొనుగోలు కేంద్రానికి వెళ్లలేకపోవడం వంటి కారణాలతో అధికారులు ట్రాక్టర్లకు అనుమతి ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో వరి సంచులు నిల్వ ఉండడంతో రైతులు వాటిని రైస్ మిల్లర్లకు తరలించి పంటను కాపాడుకుంటున్నారు.