calender_icon.png 1 May, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం!

01-05-2025 12:03:32 AM

ఆశాభావం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్..

న్యూయార్క్:  భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌పై అమెరికా 26 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ఒక ఒప్పందానికి వచ్చేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో వైట్‌హౌస్ అధ్యక్ష భవనం వద్ద ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో టారిఫ్ చర్చలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. ఇటీవలే మోదీ అమెరికాకు వచ్చిన సమయంలోనే సుంకాలపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య టారిఫ్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్నారు. దీనిపై త్వరలో న్యూఢిల్లీ ఒక ప్రకటన చేసే అవకాశముందన్నారు.