10-07-2025 12:00:00 AM
చేగుంట, జూలై 9: చేగుంట పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో తహసిల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బిఎల్వోలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ బిఎల్ఓలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని,
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, మాసాయిపేట తహసిల్దార్లు కరీముల్లా, వసంత, సిబ్బంది ఉమాశంకర్, మధుసూదన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్, ఎలక్షన్స్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.