calender_icon.png 10 July, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బుర్ర వెంకటేష్ గౌడ్

10-07-2025 12:30:59 PM

చిట్యాల,(విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రామచందర్ రావును(Ramachander Rao) చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్(Burra Venkatesh Goud) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గ్రామస్థాయి నుండి బిజెపిని పటిష్టం చేయాలని సూచించినట్లు తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుని వలె పని చేయాలని కోరారు.