10-07-2025 11:22:37 AM
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో మంగళవారం కల్తీ కల్లు(Adulterated Toddy Incident) తాగిన కారణంగా మొత్తం 31 మంది రోగులు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam's Institute Of Medical Sciences)లో చేరినట్లు నిమ్స్ ఆసుపత్రి గురువారం తెలిపింది. చికిత్స పొందుతున్న 31 మందిలో నలుగురు రోగులు డయాలసిస్ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన 27 మంది రోగులు స్థిరంగా ఉన్నారని నిమ్స్ ఆసుపత్రి సీనియర్ అధికారులు(Senior officials of NIMS Hospital) స్పష్టం చేశారు. "అవసరమైన అన్ని వైద్య సంరక్షణ అందించబడుతోంది. నిపుణులైన మల్టీస్పెషాలిటీ బృందం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది" అని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ గురువారం తెలిపారు. హైదరాబాద్లోని కూకట్ పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరగా, మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో మరో ఆరుగురు బాధితులు ఆస్పత్రుల్లో చేరారు.