calender_icon.png 16 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశస్త యాప్ లో అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

16-09-2025 07:05:08 PM

మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్

బాల్కొండ (విజయక్రాంతి): ‘ప్రశస్థ’ యాప్ దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించడం కోసం వారి చదువుల తీరును విశ్లేషించి అవసరమైన సహాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రశస్థ' అనే యాప్ను ప్రవేశపెట్టిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్(Mandal Education Officer Battu Rajeshwar) తెలిపారు. దీన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం నియమితులైన ప్రత్యేక ఉపాధ్యాయులతో డౌన్లోడ్ చేయించడంతో పాటు విద్యార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ  ఆదేశించిందని ఈ మేరకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ సూచనల మేరకు 'ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్' (ప్రశస్థ) యాప్ గురించి టీచర్లందరికీ తెలియచేయాలని ఆయన తెలిపారు. 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో గుర్తించి.. పరిష్కారాలను చూపేందుకు ఈ ప్రక్రియలో అందరి భాగస్వామ్యాన్ని పెంచనుంది.

ఇందుకోసం పాఠశాలల వారీగా నివేదికలను రూపొందింపజేస్తున్నట్లు  మండల విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ వినియోగం  ఏ విధంగా  చేయాలో ఐ ఈ ఆర్ పి,  టీచర్  ప్రసాద్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోరిడనేటర్లు, టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేటర్లు, దివ్యాంగుల కోసం నియమితులైన రిసోర్సు పర్సన్లు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), డైట్లు, సీటీఈ, సీమ్యాట్ తదితర సంస్థల బోధన సిబ్బంది ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేయించాలని పేర్కొంది. అనంతరం దివ్యాంగ విద్యార్థుల వివరాలను నమోదు చేయించాలని తెలిపింది. ఈ వివరాల ఆధారంగా పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకోనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి  రాజేశ్వర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో   కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, సిఆర్ పి ప్రభాకర్, ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.