30 August, 2026 | 10:51 AM

Breaking News

అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •   చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి   •   పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ   •   రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు   •   బీజేపీ బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా కొలిపాక రేణుక బాలరాజు   •  

ప్రైవేట్ టీచర్లకు బోధనా పద్ధతులపై శిక్షణ

18-05-2025 12:00 AM

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్టు ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థుల సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ తెలిపారు.

హైదరాబాద్‌లోని ట్రస్మా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రికగ్నుజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగే శిక్షణకు భారత స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మ్ంర తిత్వశాఖ తోడ్పాటునందిస్తోందని చెప్పారు.

జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల మనోవికాసాన్ని అర్థం చేసుకొని, వారికి ఈ తరం పద్ధతులకు అనుగుణంగా బోధించడం, వారిలో మరింత నాణ్యత పెంచేందుకు ఈ శిక్షణ దోహదపడు తుందని తెలిపారు.