8 May, 2026 | 10:37 PM

జనరల్ మజ్దూర్లుగా బదిలీ వర్కర్లు

31-08-2024 04:00 AM
  1. 2,364 మంది క్రమబద్ధీకరణకు ఆమోదం
  2. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి క్యాలెండర్ ఏడాదిలో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధుల నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని డైరెక్టర్లను ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.

జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున ఇంకా బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా ఇంటర్నల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, అర్హులైన వారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.