calender_icon.png 29 June, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ పాలనలో పారదర్శక పథకాలు

28-06-2025 12:00:00 AM

రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, జూన్ 27(విజయక్రాంతి): రాష్ట్రం లో అధికారులు ఉన్న ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం పథకాల అమల్లో పారదర్శ కంగా వ్యవహరిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నా రు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులై మొట్టమొదటిసారిగా నిర్మల్ వచ్చిన మం త్రికి జిల్లా నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పట్టణంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలోని శివాజీ రాంజీ గౌడ్ కొమరం భీమ్ ప్రొఫెసర్ జయశంకర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోని యాగాంధీ నేతృతల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పడ్డ కాం గ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలల్లో ఇంటింటికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుచేసి జవాబుదారి ఘనంగా ఉంటుందన్నారు.

రైతులు పేద వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు, రాజు యువ వికాసం, 2 లక్షల రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి సంక్షేమ పథకం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేతలు అని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమని ఇక్కడి ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు తనకు అభిమానాన్ని తెచ్చిపెట్టాయని ఈ జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు

కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష

జిల్లా అభివృద్ధిపై జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమల తీరును చాకలవారీగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని అధికారులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

జిల్లాలో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేస్తున్న పథకాలను సంక్షేమ ఫలాలను జిల్లా కలెక్టర్ నివేదిక రూపంలో మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ  మంత్రులు ఏ ఇంద్రకరణ్‌రెడ్డి ఎస్ వేణుగోపాలచారి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు.

నిర్మల్‌లో జూపల్లికి ఘన స్వాగతం

జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులై మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం సాయంత్రం నిర్మల్ లో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటలకు శివాజీ చౌక్ వద్ద మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

శివాజీ గురించి అంబేద్కర్ ట్యాంక్బండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించగా మంత్రి ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ రాంజీ గోల్ కొమరం భీం ప్రొఫెసర్ జయశంకర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిర్మల్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి విచ్చేస్తూనే పార్టీ కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి ఎస్ వేణుగోపాల చారి ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్, ముధోల్ ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యేలు నారాయణ పటేల్ రేఖా శ్యాం నాయక్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మత్ అలీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు