06-11-2025 01:10:08 AM
ముకరంపుర, నవంబర్5(విజయక్రాంతి):కరీంనగర్ పద్మనాయక వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని ముకరాంపుర లోని గల పద్మనాయక ఏసి కన్వెన్షన్ హాల్ ను బుధవారం త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రారంభించారు. అనంతరం ఏసీ కన్వెన్షన్ హాల్ ఆవరణలో రాములోరి కళ్యాణం.. హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ యర్ స్వామి వారితో..
పాటు వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాష్ రావు ఉపాధ్యక్షులు గండ్ర సంపత్ రావు, సంయుక్త కార్యదర్శి బోయినపల్లి భూపతి రావు,కోశాధికారి నిమ్మనేని భీం రావు, కార్యవర్గ సభ్యులు.. జువ్వాడి అనిల్ కుమార్, శంకర్ రావు, చిట్నేని మోహన్ రావు , సుంకిశాల సంపత్ రావు, జూపల్లి మాధవ రావు, ,జోగినిపెల్లి రాజగోపాల్ రావు, పల్లెపాటి వేణుగోపాల్ రావు, ఆయిల్నేని సుధాకర్ రావు, తాండ్ర అ శోక్ రావు, బోయినపల్లి గీత, గండ్ర మంజులల తో పాటు అధిక సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.