13-09-2025 05:05:33 PM
అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అరెస్టులు
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం త్రిపుల్ ఆర్ బాధితులను పోలీసు అరెస్టు చేయడం వివా దాస్పదమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ కార్యక్ర మాలకు శనివారం హాజరైన రోడ్లు భవనములు, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలి సేందుకు నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన త్రిపుల్ ఆర్ బాధితులు గడియారం సెంటర్ లోని ఇందిరా భవన్ కు చేరుకు న్నారు.
దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బాధిత రైతులను బలవం తంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాము ఉగ్రవాదులను కామని భూములు పోతుంటే మంత్రిని కలిసి బాధలు చెప్పుకుందామంటే పోలీసులు తమపై బల ప్రయోగం చేయడమేం టని రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. అప్పటివరకు పనులను సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.