09-06-2025 10:50:49 PM
పిట్ల పొచయ్య ముదిరాజ్..
తూప్రాన్ (విజయక్రాంతి): మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్ల సందర్భంగా తూప్రాన్ మండలంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తూప్రాన్ మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ మండల కమిటీ అధికారికంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి కిష్టాపూర్ గ్రామంలో వారి చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పిట్ల శేఖర్ ముదిరాజ్, గ్రామ అధ్యక్షులు కర్ణాకర్, మండల నాయకులు నాగరాజు గౌడ్, తొంట సతీష్, ఆడెపు శేఖర్, నవీన్, చింటూ, శ్రవణ్, తరుణ్, భాను, తదితరులు పాల్గొన్నారు.