10-06-2025 12:00:00 AM
సింగరేణి ఏరియా జీఎం దేవేందర్
మందమర్రి, జూన్ 9 : సింగరేణి ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటిస్తూ విదులు నిర్వహించి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ కోరారు. ఏరియా వర్క్ షాప్ లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏరియా వర్క్ షాప్లో ఫాటల్ ఫ్రీ జూన్ 2 నెలగా మార్చడానికి ఉద్యోగులందరూ రక్షణతో విధులు నిర్వహించాలని ఆయన కోరారు.
ప్రతి ఏడాది జూన్ లో సింగరేణి సంస్థలో ఎదో ఒక చోట గనిలో ప్రమాదాలు జరిగి కార్మికుల మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదా ల నివారణకే గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రతి జూన్లో ఫాటల్ ఫ్రీ జూన్ పేరు తో ఉద్యోగుల్లో రక్షణపై అవగాహన పెంచుతున్నామన్నారు. ఉద్యోగుల రక్షణ సంస్థ బా ధ్యత అని, ఉద్యోగుల రక్షణపై వారి కుటుం బ సభ్యులు ఆధారపడి ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
రక్షణ అనేది ఉద్యోగి ఇంటి నుంచి ప్రారంభం కావాలని సూచించారు. ఉద్యోగులు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జిఎం (రక్షణ) రఘు కుమార్, ఏరియా ఎజిఎం (ఈ అండ్ఎం) వై వెంకట రమణ, ఏరియా రక్షణాధికారి మాటూరి రవీందర్, వర్క్ షాప్ ఇంచార్జ్ వి ధూప్ సింగ్, అధికారులు దండే సదానందం హరికృష్ణ నాగుల శ్రీనివాస్, ఎఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్, ఫిట్ కార్యదర్శి ప్రభాకర్ శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.